Thammineni Seetharam: రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు

Thammineni Seetharam: రోశయ్య లేని లోటు ఎవరూ తీర్చలేరు

Update: 2021-12-04 12:05 GMT

తమ్మినేని సీతారాం (ఫైల్ ఇమేజ్)

Thammineni Seetharam: రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, గవర్నర్‌గా అనేక పదవులు చేపట్టి అత్యంత ప్రతిభావంతులుగా రోశయ్య గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. రోశయ్య తనదైన శైలిలో పాలనాపరమైన, రాజకీయ పరమైన సమస్యలపై స్పష్టమైన వైఖరిని తెలియజేసే వారన్నారు. రోశయ్య లేని లోటు ఎవరూ తీర్చలేరన్నారు తమ్మినేని. 

Tags:    

Similar News