పదో తరగతి పరీక్షా పత్రాల మాల్ ప్రాక్టీస్ సూత్రధారి అరెస్ట్...

AP Tenth Exams 2022: గిరిధర్ నారాయణ విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపాల్...

Update: 2022-04-28 04:52 GMT

పదో తరగతి పరీక్షా పత్రాల మాల్ ప్రాక్టీస్ సూత్రధారి అరెస్ట్...

AP Tenth Exams 2022: పదో తరగతి పరీక్షా పత్రాల మాల్ ప్రాక్టీస్ సూత్రధారి అరెస్ట్ అయ్యాడు. నిందితుడు గిరిధర్‌ను చిత్తూరు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నారాయణ విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపాల్‌గా గిరిధర్ పనిచేస్తున్నాడు. రైల్వేకోడూరు నారాయణ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సుధాకర్.. గిరిధర్‌కు కొశ్చన్ పేపర్‌ను బయటకు పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక నిందితుడి నుంచి సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న జరిగిన పదో తరగతి పరీక్షల్లో తెలుగు పేపర్ వన్ పరీక్ష ప్రారంభమైన అరగంటలోపే వాట్సాప్ ద్వారా పేపర్ లీక్ అవడం కలకలం రేపింది.

Full View


Tags:    

Similar News