ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు జరపనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రులు ఆదిమూలపు సురేశ్, అనిల్కుమార్ యాదవ్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 23 నుంచి మొదలై ఏప్రిల్ 8 వరకు జరుగుతాయని.. పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 కు ముగుస్తుందని మంత్రులు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 20 వరకు అవకాశం ఉందని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 27 వరకు, రూ.200 రుసుముతో జనవరి 4 వరకు, రూ.500 రుసుముతో జనవరి 18 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.
పరీక్షల షెడ్యూల్
23/03/20 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1(గ్రూప్-ఏ)
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1(కాంపోజిట్)
24/03/20 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(గ్రూప్-ఏ)
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(కాంపోజిట్)
ఓఎస్ఎస్సీ లాంగ్వేజ్ పేపర్-1
(సంస్కృతం, అరబిక్, పర్షియన్)
26/03/20 సెకండ్ లాంగ్వేజ్
27/03/20 ఇంగ్లీషు పేపర్-1
28/03/20 ఇంగ్లీషు పేపర్-2
30/03/20 మేథ్స్ పేపర్-1
31/03/20 మేథ్స్ పేపర్-2
01/04/20 జనరల్ సైన్స్ పేపర్-1
03/04/20 జనరల్ సైన్స్ పేపర్-2
04/04/20 సోషల్ స్టడీస్ పేపర్-1
06/04/20 సోషల్ స్టడీస్ పేపర్-2
07/04/20 ఓఎస్ఎస్సీ లాంగ్వేజ్ పేపర్-2
(సంస్కృతం, అరబిక్, పర్షియన్)
08/04/20 ఎస్ఎస్సీ వొకేషనల్ కోర్స్(థియరీ)