Andhra Pradesh: విశాఖ పాయకరావుపేటలో ఉద్రిక్తత

Andhra Pradesh: ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో వివాదం * పంచాయతీ కార్యాలయంలో వార్డుసభ్యుల మధ్య వాదోపవాదాలు

Update: 2021-03-15 07:56 GMT

Representational Image

Andhra Pradesh: విశాఖపట్టణం పాయకరావు పేట పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో వివాదం నెలకొంది. పంచాయతీ కార్యాలయంలో వార్డ్‌ సభ్యుల మధ్య వాదోపవాదాలు ఏర్పడ్డాయి. దనిశెట్టి వర్గీయులు చేతులు ఎత్తుతుండగా సాయి వర్గీయులు దించండి అన్నారు.. దీంతో ఇరు వర్గీయుల మధ్య వాగ్వాదం నెలకొంది. కార్యాలయానికి వెళ్తున్న దనిశెట్టి వర్గీయులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దనిశెట్టి వర్గీయులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు.

Tags:    

Similar News