విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉద్రిక్తత

* రామతీర్థం రోడ్డులోకి ప్రవేశించిన సోము వీర్రాజు * అడ్డుకున్న పోలీసులు * పోలీసుల తీరుపై సోము వీర్రాజు మండిపాటు

Update: 2021-01-05 05:22 GMT

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్‌ వలయాన్ని దాటుకొని రామతీర్థం రోడ్డులోకి ప్రవేశించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులుఅడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు సోము వీర్రాజు. ఏ2 దొంగలను రాజమార్గంలో పంపించారు. రామతీర్థం వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారోపోలీసులు చెప్పాలన్నారు. రామతీర్థం ఎట్టి పరిస్థితుల్లో వెళ్లితీరుతామని స్పష్టం చేశారు సోము వీర్రాజు.

Tags:    

Similar News