విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..!
-ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర టెన్షన్ టెన్షన్ -గ్రామ సచివాలయ పరీక్ష పేపర్లు లీకయ్యాయని ఆరోపణలు -ఆందోళనకు సిద్ధమవుతోన్న విద్యార్ధి సంఘాలు -ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ వార్డు, వాలంటీర్ పరీక్షలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ సచివాలయ పరీక్ష పేపర్లు లీకయ్యాయన్న ఆరోపణలు రావడంతోవిద్యార్ధి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దాంతో ముందుజాగ్రత్తగా ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. అయితే, ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి పేపర్ లీకైనట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించి గురువారం ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే పరీక్ష పేపర్లను సిద్ధం చేసిన ఏపీపీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి బంధువులే టాప్ ర్యాంకర్లుగా భారీ మార్కులు సాధించారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కార్యాలయం దగ్గర పోలీసులను భారీగా మోహరించారు.