గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద టెన్షన్

Guntur: అశోక్‌బాబును కలిసేందుకు టీడీపీ నేతల ప్రయత్నం. అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు.

Update: 2022-02-11 05:53 GMT

గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద టెన్షన్

Guntur: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పదోన్నతి కోసం విద్యార్హతను తప్పుగా చూపారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. దీంతో నిన్న రాత్రి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. మరోవైపు అశోక్‌బాబును కలిసేందుకు సీఐడీ కార్యాలయానికి టీడీపీ నేతలు వచ్చారు. అయితే అశోక్‌బాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో మాజీ మంత్రి దేవినేని, టీడీపీ నేతలు పిల్లి మాణిక్యాలరావు, కోవెలమూడి నానిలకు పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News