తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. భారీ బందో బస్తు మధ్య బంద్ కొనసాగుతుంది. ఎల్బీనగర్ లో తాత్కాలిక డ్రైవర్ ను ఆర్టీసీ సిబ్బంది చితకబాదారు. ఆర్టీసీ బస్సు టైర్లలో గాలి తీశారు. పోలీసులకు ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఓ మహిళా ఆర్టీసీ కార్మికురాలు స్పృహ తప్పి పడిపోయింది. నాగోల్ బండ్లగూడ డిపో వద్ద బస్సు డీజిల్ ట్యాంకర్ను ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉద్రికతపరిస్థితులు తలెత్తాయి. డీజిల్ ట్యాంకర్ టైర్లకు మేకులు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.