మృగాడిగా మారిన టీచర్.. 8వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం

Update: 2019-12-16 12:06 GMT

పశ్చిమగోదావరి జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. నిడదవోలు మండలం తాడిమళ్లలో 8 వ తరగతి విద్యార్థినిపై తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా లైంగిక వేధింపులతో బాలిక ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హైస్కూల్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో స్కూల్ దగ్గర భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కీచక మాస్టారును కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేపట్టారు. మరోవైపు పరీక్షల్లో మార్కులు తక్కువ వేస్తానంటూ తనను వేధించాడంటూ బాలిక ఆరోపిస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో టీచర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. తెలుగు టీచర్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. 

Tags:    

Similar News