విజయవాడలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. టీడీపీకి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. గుణదలలో అభిమానులు, అనుచరులతో దేవినేని అవినాష్ సమావేశం అయినట్లు సమాచారం. చంద్రబాబు మాటకు కట్టుబడి పని చేసిన అవినాష్కు... పార్టీలో తగిన న్యాయం జరగడం లేదని నెహ్రూ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. అవినాష్కు ప్రాధాన్యం ఇవ్వకుండా నేతలు కుట్ర చేస్తున్నారని... ఈ నేపథ్యంలో పార్టీ మారాలని అనుచరులు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. న్యాయం జరగని టీడీపీలో ఎంత కష్టపడి పని చేసినా... విలువ ఉండదని కార్యకర్తలు సూచించినట్లు సమాచారం. టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకునే యోచనలో దేవినేని అవినాష్ ఉన్నట్లు తెలుస్తోంది.