తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్కు పోటా పోటీ ఫిర్యాదు చేశారు. తమ విజయాన్ని తట్టుకోలేక టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు కిరాయి గూండాలతో దాడులుచేయిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇటు జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక తమ కార్యకర్తలపై దాడులు పెరిగాయని 140 దాడుల్లో ఆరుగురు కార్యకర్తలు మృతిచెందారని టీడీపీ నేతలు తమ కంప్లైంట్లో పేర్కొన్నారు.