ఏపీ గవర్నర్, స్పీకర్ కు టీడీపీ లేఖ

Update: 2020-01-27 06:15 GMT
ఏపీ గవర్నర్, స్పీకర్ కు టీడీపీ లేఖ

ఏపీ గవర్నర్, అసెంబ్లీ స్పీకర్ కు టీడీపీ శాసనసభాపక్షం లేఖ రాసింది. సభ నిర్వాహణలో బీఏసీ అజెండాను ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సభలో ఆమోదించిన బిల్లులపై చర్చ పెట్టి చెడు సాంప్రదాయాలకు నాంది పలికారని ఆరోపించారు. మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ అని బీఏసీలో నిర్ణయించి. ఇష్టాను సారంగా సభను పొడిగించారని చెప్పారు. మండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను అసెంబ్లీలో చర్చించడం రూల్స్ కు విరుద్దమని లేఖలో పేర్కొన్నారు. కౌన్సిల్ లో మాట్లాడిన అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించకూడదని రాజ్యాంగ విరుద్దంగా జరిగే చర్చలో పాల్గొన కూడదనే సభను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ శాసనసభా పక్షం తెలిపింది.

మాజీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ శాసనసభా పక్షం సమావేశం అయ్యింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు చర్చించారు. మండలి రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది పార్టీ నేతలతో చర్చించారు.  

Tags:    

Similar News