ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తరవాత మొదటిసారిగా టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం అయ్యింది . అయితే ఈ పాలిట్ బ్యూరో సమావేశంలో కొన్ని అసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల టైంలో వైసీపీ పార్టీ లాగా టీడీపీ డబ్బులు పంచలేదని కొందరు నేతలు అభిప్రయపడ్డారు .ఇదే ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు . ఇక ఈ సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు భాగోద్వేగానికి లోనయ్యారు .. టీడీపీ హయంలో చేసిన పనులను కష్టపడ్డ తీరును అయన గుర్తు చేసుకున్నారు .ఇక అన్నా క్యాంటిన్ లను మూసివేయడాన్ని గుర్తుచేసుకొని మరోసారి భాగోద్వేగానికి లోనయ్యారు .. పార్టీతో పాటుగా పాలిట్ బ్యూరోను కూడా ప్రక్షళన చేయాలని సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రబాబుకి సూచించారు.