ప్రజలు పాలన చేయాలని వైసీపీకి అధికారం అప్పగిస్తే గత ప్రభుత్వ రికార్డులు పరిశీలించడంతోనే కాలయాపన చేస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. అకౌంట్లు సెటిల్ చేసుకోవాడనికి పునసమీక్షలు చేస్తున్నారన్నారు. పీపీఏలపై హైకోర్టు తీర్పును మంత్రులు సమర్ధించుకున్నారని న్యాయస్థానాల తీర్పును అగౌరవ పరిచే విధంగా ప్రభుత్వ పెద్దలు వ్యహరిస్తున్నారన్నారు.