వారికీ రూ.50 లక్షలు బీమా కల్పించండి : పయ్యావుల కేశవ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పీఏసీ చైర్మన్, ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ లేఖ రాశారు.

Update: 2020-03-29 14:53 GMT
Payyavula Keshav (File Photo)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పీఏసీ చైర్మన్, ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పోలీసులు, మీడియా ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు సేవలందిస్తున్నారని, వారికి బీమా సౌకర్యం కల్పించాలని పయ్యావుల కేశవ్ కోరారు. ఒక్కొక్కరికీ రూ.50లక్షలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం బీమా అందించాలని లేఖలో పేర్కొన్నారు.


Tags:    

Similar News