ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాసేపట్లో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బాలినేని శ్రీనివాసులురెడ్డితో కలిసి ఎమ్మెల్యే కరణం బలరామ్, మాజీ మంత్రి పాలేటి రామారావు విజయవాడ బయల్దేరారు.
టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో రాజకీయాలు పూర్తిగా మారనున్నాయి.