గంటా తోపాటు వారు కూడా బీజేపీలోకి!

Update: 2019-11-09 02:10 GMT

మాజీ మంత్రి, వైజాగ్ నార్త్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు రెండు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారాయన. ఢిల్లీలో బీజేపీ నేత రాంమాధవ్ తో భేటీ అయిన గంటా వారం పది రోజుల్లోనే బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతకొంతకాలంగా టీడీపీ చేపడుతున్న పలు కార్యక్రమాలకు గంటా దూరంగా ఉంటున్నారు. టిడిపి మాజీ నాయకులు, రాజ్యసభ సభ్యులు వై సుజనా చౌదరి, సిఎం రమేష్ గంటా చేరికకు ముఖ్య పాత్ర వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తోపాటు మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు గంటాను అనుసరించాలని భావిస్తున్నారు. అయితే బీజేపీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. గంటా చేరికను బీజేపీలోని కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారన్న ప్రచారం ఉంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గంటా చేరికను వ్యతిరేకిస్తున్నారు.

Tags:    

Similar News