ఆ నలుగురిపై అనర్హత వేటు వేయండి..

Update: 2019-06-21 12:12 GMT

టీడీపీ లోక్‌సభ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కలిశారు. టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఎంపీలు ఇదే విషయంపై రాజ్యసభ చైర్మన్ ను కలిసి తమ వాదన వినిపించారు. పార్టీ మారిన నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఫిర్యాదు చేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌, తోట సీతా రామలక్ష్మి, ఎంపీలు గల్లా జయదేవ్‌, కింజారపు రామ్మోహన్‌ నాయుడు, కేశినేని నాని తదితరులు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కలిశారు. తాము విలీనం కోరుతూ ఎలాంటి తీర‍్మానం చేయలేదని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News