ఉండవల్లి నుంచి మకాం మార్చే యోచనలో చంద్రబాబు

Update: 2019-06-26 10:53 GMT

ఉండవల్లి నుంచి మకాం మార్చే యోచనలో ఉన్నారు మాజీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఆయన నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్‌లో పార్టీ నేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఇందులో ఇల్లు మారడమే మంచిదని మెజార్టీ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దీంతో ఇల్లు మారాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తోంది. నోవాటెల్ హోటల్ ప్రాంతంలోని భారతీనగర్ 7వ క్రాస్‌లో క్వాలిటీ ఐస్‌క్రీమ్ కంపెనీకి చెందిన గెస్ట్‌హౌస్, కామినేని ఆస్పత్రి ఎదురుగా ఉన్న గ్రావెల్ ఇండియా వారి గెస్ట్‌ హౌస్‌ను కూడా టీడీపీ నేతలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News