గవర్నర్తో TDP సభ్యులు సమావేశం.. దాడికి సీఎం ప్రోత్సహిస్తున్నారంటూ కంప్లైంట్
సీఎం జగన్తో పాటు అధికార పార్టీ సభ్యులపై టీడీపీ నాయకులు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల పనితీరు అత్యంత దారుణంగా ఉందని స్వయంగా ముఖ్యమంత్రే ప్రతిపక్ష సభ్యులపై దాడికి ప్రోత్సహిస్తున్నారని వివరించారు.
భౌతికంగా దాడికి ప్రయత్నిస్తున్నారని స్పీకర్ కూడా అధికార పార్టీ సభ్యుడిగా ఉండటం చేత ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. సభ అనుమతి లేకుండానే సస్పెండ్ చేయకుండానే తమ సభ్యులను మార్షల్స్తో బయటకు పంపించారని కంప్లైంట్లో పేర్కొన్నారు.