TDP Protest: రోడ్లపై ఏర్పడిన గుంతల్లో చేపలను, బురదమయంగా ఉన్న రోడ్లపై నాట్లు

TDP Protest - West Godavari: ప.గో. జిల్లా గుమ్ములూరులో టీడీపీ వినూత్న నిరసన

Update: 2021-10-12 02:21 GMT

TDP Protest: రోడ్లపై ఏర్పడిన గుంతల్లో చేపలను, బురదమయంగా ఉన్న రోడ్లపై నాట్లు

TDP Protest - West Godavari: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం గుమ్ములూరులో రోడ్ల స్థితిపై టీడీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. రోడ్లపై ఉన్న గుంతల్లో చేప పిల్లలను వదిలారు. అలాగే బురదమయంగా ఉన్న రోడ్లపై వరినాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రోడ్లను వెంటనే ప్రభుత్వం మరమ్మతులు చేపించాలని ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.

వర్షాకాలం వస్తే ఈ రోడ్లపై నడవలేని పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధి దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News