సెలెక్ట్ కమిటీ అంటే ప్రభుత్వం ఎందుకు భయపడతున్నదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇవాళ ఉదయం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సెలెక్ట్ కమిటీ వేసి ఉంటే ఇప్పటికే సగం ప్రొసీడింగ్స్ జరిగేవన్నారు.
సెలెక్ట్ కమిటీకి పంపడం అంటే అడ్డుపడటం కోసం కాదని సమగ్ర చర్చ కోసమే బిల్లుల్ని కమిటీకి పంపించామని యనమల చెప్పారు. 'గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీలకు ఏ పార్టీతో సంబంధం ఉండదు. అడ్డుకునే వ్యవస్థగా మండలిని ఎలా చిత్రీకరిస్తారన్నారు. ప్రజలకు అవసరమయ్యే బిల్లులను తీసుకొస్తే సహకరిస్తామని యనమల చెప్పారు