విజయసాయిరెడ్డి కరోనాకు అతీతుడా? నేషనల్ పెర్మిట్ లారీ లాగ తిరుగుతున్నాడు: వర్ల రామయ్య ట్వీట్
కరోనా వైరస్ తో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బయపడుతుంటే రాజకీయ నాయకులు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి కరోనా వైరస్కు అతీతుడా అంటూ రామయ్య ట్వీట్ చేశారు. ఇదే విషయంపై జగన్ను ఆయన ప్రశ్నించారు.
''ముఖ్య మంత్రి గారు! 14 రోజులు క్వారంటైన్కు వెళ్లవలసి వస్తుందని యూపీ ముఖ్యమంత్రి తన తండ్రి అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లలేదు. మరి ఏ2 విజయసాయిరెడ్డి నేషనల్ పెర్మిట్ లారీ లాగా రాష్ట్రాలన్నీ కలియ తిరుగుతున్నాడు. ఈయనను క్వారంటైన్కు పంపక్కర్లేదా? కరోనాకు అతీతుడా? మీ ప్రభుత్వం తప్పు కదూ?'' అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.
ముఖ్య మంత్రి గారు! 14 రోజులు క్వరంటైన్ కు వెళ్లవలసి వస్తుందని UPముఖ్య మంత్రి తన తండ్రి అంత్య క్రియలకు డిల్లీ వెళ్లలేదు. మరి A2 విజయసాయి రెడ్డి గారు నేషనల్ పెర్మిట్ లారీ లాగ రాష్ట్రాలన్నీ కలియ తిరుగుతున్నాడు. ఈయనను క్వరంటైన్కు పంపక్కరలేదా? కరొనాకు అతీతుడా? మీ ప్రభుత్వం తప్పు కదూ?
— Varla Ramaiah (@VarlaRamaiah) April 21, 2020