మాజీ విప్ కూన రవికి హై కోర్టులో ఊరట
ఏపీ మాజీ విప్ కూన రవికి హై కోర్టులో ఊరట లభించింది. కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ ఆయనపై కేసు నమోదైంది.
ఏపీ మాజీ విప్ కూన రవికి హై కోర్టులో ఊరట లభించింది. కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ ఆయనపై కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి కూన రవి అజ్ఞాతంలోకి వెళ్లారు. కూన రవి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. గత నెలరోజులుగా కూన అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఈ కేసుపై అతని తరుపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం.