రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ మౌనం వహించడం ప్రమాదకరమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రం విడిపోయి ఆరేళ్లయినా రాజధానిపై చర్చ జరగడం బాధాకరమని అన్నారు. రాజధానిపై బొత్స వ్యాఖ్యలు గందరగోళం సృష్టించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.