ఏపీ మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ చేశారు. మంత్రి తానేటి వనిత సంతకాన్ని కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత రెడ్డప్ప ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మంత్రి తానేటి వనిత, హోంమంత్రి సుచరితకు, డీజీపీకి ఫిర్యాదు చేశారు.
తన సంతకం ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి వనిత పేరుతో కడప జిల్లా కలెక్టర్కు సిఫారసు లేఖ రాసినట్లు తెలుస్తోంది. మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి కలెక్టర్కు లేఖ ఇచ్చిన ఎం. రెడ్డప్ప అసైన్డ్ భూమిని కేటాయించాలని నకిలీ లేఖ ఇచ్చారు. లెటర్పై మంత్రి సంతకం తప్పుగా పెట్టడంతో అడ్డంగా బుక్కాయ్యాడు.