గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారు. నర్సరావుపేటకు చెందిన డాక్టర్ అరవింద బాబు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు అరవింద బాబు. చదలవాడతో పాటు మరికొందరు ద్వితియ శ్రేణి నేతలు బీజేపీలో చేరనున్నారు.