గోదావరిలో బోటు మునిగి 10 రోజులు పూర్తైనా దాన్ని బయటకు తీయలేకపోయారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి సీఎం జగన్ వచ్చారు వెళ్లారు కానీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కనీసం మృతదేహం ఇస్తే దహన సంస్కారాలైనా చేసుకుంటామని బాధిత కుటుంబాలు రోధిస్తున్నాయని చిన రాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు.