Buddha Venkanna: చంద్రబాబు భిక్ష పెడితే ఎంపీగా గెలిచిన కేశినేని నాని.. వైసీపీలో చేరి విమర్శిస్తున్నారు

Buddha Venkanna: వైసీపీలో చేరేముందు జగన్‌ను కూడా నాని విమర్శించారు

Update: 2024-02-03 14:15 GMT

Buddha Venkanna: చంద్రబాబు భిక్ష పెడితే ఎంపీగా గెలిచిన కేశినేని నాని.. వైసీపీలో చేరి విమర్శిస్తున్నారు

Buddha Venkanna: చంద్రబాబు భిక్ష పెడితే ఎంపీగా గెలిచిన కేశినేని నాని స్వలాభాల కోసం వైసీపీలో చేరి విమర్శిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. తన లావును చూసి బలం అనుకుంటున్నారని .. నాని వెంట పట్టుమని పది మంది కూడా లేరని ఎద్దేవా చేశారు. నాని వైసీపీలో చేరడం వల్లే వసంత కృష్ణ ప్రసాద్‌ పార్టీ మారుతున్నారన్న బుద్ధా వెంకన్న.. ఎన్టీఆర్ జిల్లాలో మరింత మంది నేతలు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ఇక చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారన్న నాని వ్యాఖ్యలను నిజంలా ప్రచారం చేస్తున్న పెద్దిరెడ్డి.. జగన్‌ నీచ సీఎం అన్న నాని వ్యాఖ్యలను కూడా అంగీకరిస్తారా అని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న.

Tags:    

Similar News