అలాంటి పరిస్థితి రాకూడదు‌: స్పీకర్‌ తమ్మినేని

Update: 2019-06-13 11:44 GMT

స్పీకర్‌ పదవి తనకు సవాల్‌ అని, ఏకగ్రీవంగా తనను ఎన్నుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. తనను స్పీకర్‌గా ఎన్నుకుందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గతంలో శాసనసభలో పెద్దలు విశిష్ట సంప్రదాయాలు నెలకొల్పారని, వ్యవస్థల పట్ల ప్రజల నమ్మకం పోతే, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని అన్నారు. తన నిర్ణయాలు కోర్టులు సమీక్షించాల్సిన పరిస్థితి ఏనాడూ రాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. సభా గౌరవంపై శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నామని, తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. అనంతరం, రేపు ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభను వాయిదా వేశారు.

Tags:    

Similar News