ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణా నదిలో ఈత పోటీలు నిర్వహించారు. కృష్ణా నదిలో 1.5 కిలోమీటర్లు దుర్గా ఘాట్ నుంచి సీతానగరం ఘాట్ వరకు ఈ పోటీలు సాగాయి. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పోటీలను ప్రారంభించారు. పోటీల్లో 290 మంది ఈతగాళ్లు పాల్గొన్నారు.