'మన్మధ రాజా' పాటకు స్టెప్పులేసిన ఇద్దరు వాలంటీర్లు..విధుల నుంచి తొలగించిన కమిషనర్

* 'మన్మధ రాజా' పాటకు స్టెప్పులేసిన ఇద్దరు వాలంటీర్లు * ఇద్దరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించిన కమిషనర్

Update: 2021-09-14 04:15 GMT

'మన్మధ రాజా' పాటకు స్టెప్పులేసిన ఇద్దరు వాలంటీర్లు 

Chittoor: చిత్తూరు నగరంలో వాలంటీర్లు డ్యాన్స్ చేయడం కలకలం రేపింది. కట్టమంచి 4వ వార్డు సచివాలయంలో 'మన్మధ రాజా' పాటకు ఇద్దరు వాలంటీర్లు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ విచారణకు ఆదేశించారు. సూపర్‌వైజర్ అధికారి శ్రీలత, సీనియర్ అసిస్టెంట్ తనూజ లను విచారణ అధికారులుగా నియమించారు. అనంతరం విచారణ చేపట్టి నివేదికను కమిషనర్‌కు ఇచ్చారు. దీంతో ఇద్దరు వాలంటీర్లు జగదీష్, మౌనిక లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News