ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. కరోనా కారణంగా ఏపీలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేశ్ కుమార్ ప్రకటించారు. ఎస్ఈసీ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది. తమను సంప్రదించకుండానే ఎలా వాయిదా వేస్తారంటూ అధికార పార్టీ నాయకులు వాదిస్తున్నారు.
ఇదే అంశంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను సీఎం జగన్ కలిసి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఈ అంశంలో న్యాయపోరాటానికి దిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ వేసింది. దీనిపై అత్యున్నతస్థాయి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది.