సుప్రీంకోర్టులో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కోట్టి వేసింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. సత్వరమే రంగులు తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.