బ్రేకింగ్ : బీజేపీలో విలీనమైన టీడీపీ రాజ్యసభాపక్షం..బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన...
బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనమైంది. చంద్రబాబుకి షాకిచ్చిన నలుగురు ఎంపీలు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ నడ్డాతో కలిసి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుతో సమావేశమైన సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్లు ఆ మేరకు లేఖ అందజేశారు. ఇకపై తమకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదన్న సుజనా, సీఎం రమేష్, టీజీలు అమిత్షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు.