కొత్త ఎమ్మెల్యేలకు రేపట్నుంచి శిక్షణా తరగతులు

Update: 2019-07-02 11:28 GMT

కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు రేపట్నుంచి రెండ్రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీలో 100మందికి పైగా నూతన శాసనసభ్యులు ఉన్నారన్న స్పీకర్‌ వారందరికీ సభా నియమాలు, హక్కులు, బాధ్యతలు, సంప్రదాయాలపై వివిధ రంగాల నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీ చక్కని వేదికన్న తమ్మినేని సీతారాం శాసనసభ గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపజేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Full View

Tags:    

Similar News