గుంటూరు జిల్లాలో 6 రెడ్ జోన్లు.. బయటకు వస్తే ఇక అంతే..
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా అన్ని జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందింది.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా అన్ని జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందింది.ఇప్పటికే గుంటూరు జిల్లాలో మొత్తం 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ నేపధ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించామని కలెక్టర్ ఆనంద్కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని గుంటూరు, మేడికొండూరు(తురకపాలెం),
మాచర్ల, అచ్చంపేట, క్రోసూరు, మంగళగిరి పాంత్రాలను రెడ్జోన్లుగా ప్రకటించినట్లు తెలిపారు. రెడ్జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరంగా అమలు చేస్తామని చెప్పారు. ఆ రెడ్ జోన్లలో ఏ ఒక్కరూ నిత్యావసర సరుకులకు కొనుగోలు చేయడానికి కూడా బయటకు రావడానికి వీల్లేదని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఇంకా 20 మందిని గుర్తించాల్సి ఉందని చెప్పారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆ ప్రాంతాలకు అధికార యంత్రాంగమే అన్ని సరుకులు తీసుకొచ్చి సరఫరా చేస్తుందని చెప్పారు. జిల్లాలో వైరస్ పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వైద్య, ఇతర సిబ్బందిని ఎవరైనా అడ్డగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. వైరస్ వ్యాప్తి నివారణ, సహాయక చర్యల కోసం విరాళాలు ఇచ్చేవారు కలెక్టరేట్లో సంప్రదించాలని కోరారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతోన్న పోరులో అన్ని జాగ్రత్తలు తీసుకుని సైనికుల్లా పోరాటం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ , ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుపై శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్షలో ప్రసంగించారు.. ఉద్యోగులు ఎలాంటి సవాళ్ల నైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా అనుమానితులకు వైద్య సేవలు అందించేందుకు రూ. వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు 2.50 కోట్ల రూపాయలకు కలెక్టర్ ఆనంద్కుమార్ అనుమతులు జారీ చేశారు. ఎంపీ గల్లా జయదేవ్ తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈ మొత్తా న్ని కేటాయించడంతో ఆమోదం తెలిపారు. గుంటూరు జ్వరాల ఆసుపత్రిలో 1.98 కోట్లు రూపాయలు జీజీహెచ్కు .51.70లక్షల రూపాయలు ఎయిర్ కంప్రషర్, వ్యాక్యూమ్ పంప్స్, సర్జికల్ ఫేస్ మాస్కులు, సీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ఎన్ 95 మాస్కులు, సరఫరా చేయాలని ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ కేశవరావును కలెక్టర్ ఆదేశించారు.