ఏపీలో నూతన మద్యం పాలసీకి హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ నెల 23 వరకు మద్యం పాలసీపై ముందుకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది. ఏ ప్రాతిపదికన మద్యం పాలసీ డిజైన్ చేశారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మద్యం రిటైల్ ధరలు ప్రభుత్వం చేతిలో ఉంటాయా..? బార్లకు అంత ధరలు ఎలా నిర్ణయిస్తారని అడిగింది. మొత్తం అంశంపై ఈనెల 9వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఈ నెల 16న కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.