అనంతపురం జిల్లాలో రైలు దోపిడీ.. సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన...

Anantapur: రైల్వే సిగ్నల్ కట్‌ చేసి దొంగతనానికి పాల్పడిన దుండగులు...

Update: 2022-04-09 06:35 GMT

అనంతపురం జిల్లాలో రైలు దోపిడీ.. సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన...

Anantapur: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్ తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అర్థరాత్రి రైల్లో దోపిడీ జరిగింది. తిరుపతినుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ రైల్లో దొంగలు పడ్డారు. సిగ్నల్ వైర్లను కట్ చేసి రైలుదోపిడీకి పాల్పడ్డారు. రైలు ఆగిన తర్వాత ఎస్5, ఎస్7 భోగీల్లో ప్రయాణికుల బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. సమీప రైల్వేస్టేషన్ డోన్ చేరుకున్న తర్వాత రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 తులాల బంగారు నగలు అపహరించారని ‎ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News