Gollapalli Surya Rao: చంద్రబాబు గెంటేస్తే.. జగన్ అక్కున చేర్చుకున్నారు

Gollapalli Surya Rao: వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు

Update: 2024-02-28 14:09 GMT

Gollapalli Surya Rao: చంద్రబాబు గెంటేస్తే.. జగన్ అక్కున చేర్చుకున్నారు

Gollapalli Surya Rao: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీని వీడిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు , పి.గన్నవరం టీడీపీ సీనియర్ నేత స్టాలిన్ బాబు వైసీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో సూర్యారావు వైసీపీ కండువా కప్పుకున్నారు. నిబద్ధతతో పని చేసిన తనను మెడబట్టుకుని గెంటేసినంత పని చేశారంటూ సూర్యారావు వాపోయారు. చంద్రబాబు గెంటేస్తే.. జగన్ అక్కున చేర్చుకున్నారన్నారు సూర్యారావు.

Tags:    

Similar News