కృష్ణాజిల్లా సూరంపల్లిలో మండల పరిషత్ పాఠశాల పైకప్పు కుప్పుకులడంతో సుమారు 50 మంది విద్యార్ధులకు పెనుప్రమాదం తప్పింది. భవనం పైకప్పు కూలిన సమయంలో తరగతి గదుల్లో ఎవరు లేకపోవడం ముప్పు తప్పింది. పురాతన భవనం కావడంతో కొంత కాలంగా పగుళ్లు ఏర్పడినట్టు పాఠశాల ఉపాద్యాయులు గుర్తించారు. దీంతో గత నెల రోజులుగా ఆరుబయట తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పైకప్పు కూలింది.