Konaseema: సచివాలయం వద్ద దీక్షలు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

Konaseema: మా జీతాల మాకు ఇవ్వండి మహా ప్రభో అంటున్న పారిశుద్ధ్య కార్మికులు

Update: 2023-07-05 08:26 GMT

Konaseema: సచివాలయం వద్ద దీక్షలు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవరపల్లి గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు జీతాలు రాక పోవడంతో స్థానిక సచివాలయం వద్ద నిరాహారదీక్షలు చేపట్టారు . జనవరి నుంచి ఈ ఆరు నెలలకు తమకు గ్రామ పంచాయతీ నుండి జీతాలు ఇవ్వడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ గగ్గోలు పెడుతున్నారు. పనులు చేయించుకుని జీతాలు ఇవ్వకపోతే మేము ఎలా బ్రతికేది అంటూ ఆందోళన చేపట్టారు. గ్రామంలో పరిశుభ్రంగా వుండే విధంగా పారిశుద్ధ్య పనులు చేసే మాకు ఆరు నెలల నుంచి జీతాలు లేవని మాకు జీతాలు ఇచ్చేవరుకు ఇక్కడనుండి కదిలే పరిస్థితి లేదన్నారు .మా జీతాలు మాకు ఇచ్చి న్యాయం చేయాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News