రేపటి నుంచి హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూల విక్రయం

Update: 2020-05-30 12:40 GMT

లాక్ డౌన్ నాలుగో దశ రేపటితో ముగియనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మినహాయింపులు ఇస్తున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డు ప్రసాదాలు ఆన్ లైన్ లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. రేపటి నుంచి హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని టీటీడీ కళ్యాణమండపంలో శ్రీవారి లడ్డు ప్రసాదాలు విక్రయించనుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు లడ్డలు అమ్మనుంది. సగం ధరకే లడ్డు అమ్మనుంది. ఒక్కలడ్డు ధర 25 రూపాయలకు విక్రయించనున్నట్టు టీటీడీ వెల్లడించింది

Tags:    

Similar News