వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం సలహాదారుగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి సలహాదారుగా సజ్జలను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కేబినేట్ హోదా కల్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నియమాకం తక్షణం అమలులోకి వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి జర్నలిస్టుగా అపార అనుభవం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుగా, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ ఆయన పనిచేశారు.