Srisailam: శ్రీశైలంలో వైభవంగా సహస్ర దీపాలంకరణ సేవ
Srisailam: అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్ల వెండి రథోత్సవం
Srisailam: వారంతపు సేవలలో భాగంగా శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్లకు, సహస్ర దీపాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని పురాతన దీపాలంకరణ మండపంలో ప్రత్యేక ఊయలలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులు చేసి సహస్ర దీపాలను వెలిగించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ వెండి రథోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న, అర్చకులు, ఆలయ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.