టీటీడీకి ఆర్‌ఎస్ బ్రదర్స్ భారీ విరాళం

Update: 2019-08-24 05:40 GMT

తిరుమల శ్రీవారికి ప్రముఖ వస్త్ర సంస్థ ఆర్‌ఎస్ బ్రదర్స్ యాజమాన్యం 2 కోట్ల విరాళాన్ని అందజేసింది. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆర్‌ఎస్ బ్రదర్స్ యజమానులు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం శ్రీవారి అన్నప్రసాద పథకానికి రూ. కోటి, శ్రీవాణి పథకానికి రూ. కోటి విరాళంగా ఇచ్చారు. టీటీడీ ఛైర్మెన్‌ కు విరాళాన్ని అందజేశారు. దాతలు ఇస్తున్న విరాళాలతో సామాన్య భక్తులకు మరింత విస్తృత సేవలు అందిస్తామని టీటీడీ ఛైర్మెన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  

Tags:    

Similar News