రాష్ట్రంలో అమలవుతోన్న పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని.. ఇలాంటి సమయంలో చంద్రబాబు యాత్రలు చేస్తే కరువుకాటకాలు వస్తాయని విమర్శించారు ఎమ్మెల్యే రోజా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వీలైతే జగన్ పాలనను అభినందించాలని హితవు పలికారు. లేదంటే సైలెంట్గా ఉండండి తప్ప రాజకీయాలు చేయోద్దని చంద్రబాబును ఉద్దేశించి రోజా విమర్శించారు.