Road Accident: నడిచి వెళ్తున్న భవానీ భక్తులను ఢీకొన్న కారు.. ప్రమాదంలో ఇద్దరు భవానీ భక్తులు మృతి

Road Accident: కాకినాడ జిల్లా తుని హైవేపై రోడ్డు ప్రమాదం

Update: 2022-12-03 03:45 GMT

Road Accident: నడిచి వెళ్తున్న భవానీ భక్తులను ఢీకొన్న కారు.. ప్రమాదంలో ఇద్దరు భవానీ భక్తులు మృతి

Road Accident: కాకినాడ జిల్లా తుని హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. నడిచి వెళ్తున్న భవానీ భక్తులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం నుంచి విజయవాడకు నడిచి వెళ్తున్న క్రమంలో తుని హైవే డీమార్ట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News