అనంతపురం జిల్లా పులగంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం

Ananthapur: మినీ వ్యాన్ బోల్తా, ముగ్గురు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.

Update: 2022-02-20 04:44 GMT

అనంతపురం జిల్లా పులగంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం

Ananthapur: అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే మినీ వ్యాన్ బోల్తా పడిందని తెలుస్తోంది. మరో కిలోమీటర్ వెళితే అంతా ఇంటికి చేరేవారు. ఈలోపే ప్రమాదం జరగడంతో పులంగిపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది.

Tags:    

Similar News