Andhra Pradesh: ప.గో.జిల్లా జంగారెడ్డిగూడెంలో రోడ్డుప్రమాదం

Andhra Pradesh: ట్రాక్టర్‌-లారీ ఢీ, 20 మందికి తీవ్రగాయాలు * 11 మంది పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు

Update: 2021-03-07 04:59 GMT

Representational Image

Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బైపాస్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. శ్రీనివాసపురం జంక్షన్‌ దగ్గర ఓ ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. 11 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని.. ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన 9 మంది జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులంతా కృష్ణాజిల్లా చిన్నవరం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదుచేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.

Tags:    

Similar News